TokyoOlympicsలో భారత్‌కు మరో పతకం ఖాయం

గుడ్ న్యూస్.. టోక్యో ఒలింపిక్స్‌లో మరో పథకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది.

అటు క్వార్టర్స్‌లో ప్రత్యర్థేమో మాజీ ప్రపంచ ఛాంపియన్‌. అయినప్పటికీ ఈ యువ బాక్సర్‌ ఏ మాత్రం బెదరలేదు. తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా పంచ్‌లు విసిరింది. రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడి 5-0తో బౌట్‌ ముగించింది. మూడో రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ పోరులో 30-27, 29-28, 28-29, 30-27, 30-27తో లవ్లీనా ఘన విజయం అందుకుంది.