ఆ దర్శకుడితో త్రిష పెళ్లి.. క్లారిటీ వచ్చేసింది !

హీరోయిన్ త్రిష పెళ్లి ఫిక్సయింది. కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో ఆమె ప్రేమలో పడింది. అది పెళ్లి వరకు వెళ్లింది..  పెద్దల అంగీకారంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని గత కొన్నిరోజులగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై త్రిష టీమ్ స్పందించింది.

త్రిష పెళ్లి విషయంలో.. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని.. ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వివరించింది. ప్రస్తుతం త్రిష మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. మరికొన్ని తమిళ సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఇక నాయకి తర్వాత త్రిష మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కోసం త్రిషని తీసుకున్నా.. సెట్స్ మీదకు వెళ్లకముందే ఆమె తప్పుకుంది.