చరణ్ కోసం తారక్ కి నో చెప్పేసింది

సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయ్. ఓ హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్తుంటుంది. హీరోయిన్స్ కూడా ఇలాగే మారుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉండనుంది. ఈ సినిమా సెట్ అవ్వగానే హీరోయిన కియారా అద్వానీని ఎంపిక చేశారు. కానీ ఆమె మొదట ఓకే చెప్పేసి.. ఆ తర్వాత నో చెప్పేసింది. దీనికి కారణం శంకర్ – రామ్ చరణ్ సినిమానే.

చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కైరా అద్వానీ ని తీసుకున్నారు. ఇప్పటికే చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా చేసింది. అటు ఎన్టీఆర్, ఇటు చ‌ర‌ణ్‌.. రెండింటిలో ఒక్క సినిమానే ఒప్పుకునే ఛాన్స్ కైరాకు ఉంది. ఈ ద‌శ‌లో… చ‌ర‌ణ్‌కే ఓటేసిందామె. ఎందుకంటే.. ? గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయిన చేయాలని హీరోలు ఆశపడ్డట్టే.. హీరోయిన్లకు ఆ ఆశ ఉంటుంది కదా.. !