నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి

 పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే అని ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్ కౌశిక్‌రెడ్డికి నామినేటెడ్‌ పోస్ట్ ఇచ్చారు.

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి ఖరారు చేయనున్నారనే ఉత్కంఠ పెరిగింది.