చరణ్-శంకర్ సినిమా.. జెడ్ స్పీడు !

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జెడ్ స్పీడుతో జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుందట. సెప్టెంబర్ 8 నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మేరకు చరణ్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పటికే దర్శకుడు శంకర్ లొకేషన్లు ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఎక్కువ భాగం ఇండియాలోనే షూటింగ్.. అది కూడా హైదారాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలని సెలక్ట్ చేశారట. కథకు ఈ ప్రాంతాలకు లింక్ ఉందని చెబుతున్నారు. పక్కా ప్లానింగ్ తో వచ్చే యేడాది (2022) జులై నాటికి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. శంకర్ సినిమా ఇంత వేగంగా పూర్తి కానుంది అంటే నమ్మడం కష్టమే. ఆయన చెక్కుడు మాములుగా ఉండదు. అవుట్ పుట్ కూడా ఆ రేంజ్ లో ఉంటది మరీ.. !

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటించనుంది. థమన్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంకర్ మార్క్ సోషల్ మేసేజ్ తో.. యాక్షన్ ఎంటర్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.