ప్రకాష్ రాజ్ సుతిమెత్త‌ని హెచ్చ‌రిక

‘మా’ ఎన్నికలు ఎప్పుడ‌నే విష‌యం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే ఇప్పటికే మా ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఇప్ప‌టికే ఐదు గురు బ‌రిలో నిలుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్ – మంచు విష్ణుల మధ్య ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ.. త‌ర‌చూ కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా ప్ర‌కాశ్‌రాజ్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

‘తెగేదాకా లాక్కండి’ అని తెలుగులో సుతిమెత్త‌ని హెచ్చ‌రిక చేయ‌డం విశేషం. దీనికి జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారాయ‌న‌. ప్ర‌కాశ్‌రాజ్ తాను ప్ర‌శ్నిస్తున్న‌ట్టు చెప్పుకున్నారే గానీ, ఆయ‌న చేసింది హెచ్చ‌రికే అనే వాళ్లు లేక‌పోలేదు. ఇంతకీ ఎవ‌రు లాగుతున్నారు? ఎందుకు ? అంటూ నెటిజన్స్ ప్రకాష్ రాజ్ ట్విట్ పై కామెంట్స్ పెడుతున్నారు. ఇక సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.