వివాహ భోజనంబు.. వినోదం విందు !

కమెడియన్ సత్య హీరోగా మారి చేసిన చిత్రం ‘వివాహ భోజనంబు’. సందీప్ కిషన్ నిర్మాత. ఈ సినిమా సోనీ లివ్ ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో దొర్లిన ఫన్ సినిమాకు వాడుకున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ట్రయిలర్ ను కట్ చేసారు. 

తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద పడితే… పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తే.. ఇదీ  కాన్సెప్ట్ గా ట్రయిలర్ చెబుతోంది. ఈ చిత్రానికి రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. సత్యకి జంటగా అర్జావీ రాజ్ జతకట్టింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సందీప్ కిషన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశషం.