గోవా ఫైట్ పై గొప్పలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్నాళ్లు గోవాలో రచ్చ చేశాడు. రౌడీల బొక్కలు ఇరగదీశాడు. ఆయన కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సర్కారువారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయింది. అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు. సినిమాకే ఈ యాక్షన్ సీన్ హైలైట్. ఇంకా చెప్పాలంటే మహేష్ కెరీర్ లో మరుపురానీ యాక్షన్ సీన్ గా నిలిచిపోతుందని గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమా తదురి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. త్వరలోనే ప్రారంభం కానుంది. బ్యాక్ దోపిడీ నేపథ్యంలో సర్కారువారి పాట తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా సాగుతుందని సమాచారమ్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు.