పదిమంది విద్యార్థులకు కరోనా

తెలుగు రాష్టాల్లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో విద్యాలయాలు తెరిచేందుకు ప్రభుత్వం గీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భయపడుతూనే తల్లిదండ్రులు పిల్లలని పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోని మదనపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. 

11 మందికి పాజిటివ్‌ రావడంతో వైద్య బృందం వెళ్లి వైద్య సేవలు అందించినట్లు కురబలకోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి అనుహ్య తెలిపారు. ఇక్కడ చదువుతున్న 10 మంది విద్యార్థులు, డైనింగ్‌ హాల్‌ నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు.