ఆర్ఆర్ఆర్’తో పవన్.. రాసుకున్నోళ్లకు రాసుకున్నంత !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. వెళ్లి వెళ్లగానే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో ఓ ఫోటోకు పోజు ఇచ్చాడు. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు పవన్ ఎందుకు ఢిల్లీ వెళ్లినట్టు ? ఆర్ ఆర్ ఆర్ కోసమేనా ? అనే ప్రచారం మొదలైంది. కొన్నాళ్లుగా వైసీపీ, సీఎం జగన్ ని టార్గెట్ చేస్తున్న బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పవన్ సాయం చేయనున్నాడా ? అనే సందేహాలకు లెటెస్ట్ పిక్ తెరలేపింది.

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరారు. కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్‌ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్‌ గాంధీతో టి.కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. మొత్తానికి.. తెలుగు రాష్ట్రాల కీలక నేతలు ఢిల్లీ చేరుకొని రాజకీయాలని హీటెక్కిస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ని పవన్ కలవడమే.. మస్త్ మజాని పంచుతోంది. ఈ కలయికపై రాసుకున్నోళ్లకు రాసుకున్నంత కానుంది.