తేజుకు ప్రమాదం ఎలా జరిగిందంటే ?

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తేజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మొదట ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం అపోలో హాస్పటల్ కి తరలించారు. తేజుకు ప్రమాదం ఎలా జరిగింది ? ప్రమాదానికి కారణాలేంటీ ?? అనే ఆందోళనలో మెగా అభిమానులు ఉన్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 8:30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని మాధాపురం ఎస్సై తెలిపారు. తేజు ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో స్కిడ్ అయిందని చెప్పారు. అయితే బైక్ పెద్దగా డ్యామేజ్ కాలేదు. బ్రేకులేసి బైక్ ని కంట్రోల్ చేసిన తేజు.. తనని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన పక్కటెముకలకు బలంగా దెబ్బలు తాకినట్టు సమాచారం.

అయితే ప్రాణాలకు మాత్రం ఏమీ ప్రమాదం లేదని ఇప్పటికే డాక్టర్లు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే బ్రెయిన్ స్కాన్ కు సంబంధించిన రిపోర్ట్స్ వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో తేజు హెల్మెంట్ పెట్టుకున్నారు. దీంతో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకోగలిగారని చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో అపోలో హాస్పటల్ వర్గాలు తేజు హెల్త్ బులిటెన్ ని విడుదల చేయనుంది.