తేజు ఎక్కడికి వెళ్లొస్తుంటే ప్రమాదం జరిగిందో తెలుసా ?

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తేజు ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో స్కిడ్ అయింది. బైక్ తో పాటు తేజు పల్టీలు కొడుతూ చాలా దూరం ఎగిరిపడ్డాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు సీసీపుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. తేజుకి కుడి కన్ను, చాతీ, పొట్టభాగంలో గాయాలు అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.

శుక్రవారం రాత్రి 8:30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని మాధాపురం ఎస్సై తెలిపారు. ఇంతకీ ఆ సమయంలో తేజు ఎక్కడికి వెళ్లొస్తున్నారు. అంత స్పీడుగా వెళ్లడానికి కారణాలు ఏంటీ ? అనే చర్చ జరుగుతోంది. అయితే తేజ్‌ తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్‌ తెలిపారు. తన కుమారుడు నవీన్‌ విజయ కృష్ణకు సాయితేజ్‌ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నరేశ్‌ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.