చైతూ కోసం మీడియా వెయిటింగ్

ఇటీవల నాగ చైతన్య-సమంత జంట మీద అనేక గ్యాసిప్ లు చలామణీలోకి వచ్చాయి. వీరిద్దరికి చెడింది. పరిస్థితి విడాకుల దాక వెళ్లింది. అందుకే సమంత తన ట్విట్టర్ ఖాతా పేరులో అక్కినేని పదాన్ని తొలగించింది. ఆ స్థానంలో ‘ఎస్’ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. ఇదీగాక.. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ అంటూ సామ్ ప్రకటన చేసింది. దీని వెనక భర్త నాగ చైతన్యతో కారణమనే పుకార్లు వినిపించాయి. ఇప్పుడేమో.. సామ్ టాలీవుడ్ ని వదిలేది బాలీవుడ్ కి వెళ్లేందుకు రెడీ అయింది. ఇప్పటికే ముంబైలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా క్లారిటీ కోరుకుంటుంది. ఈ విషయాలపై ఇప్పటి వరకు ఇటు చైతూ గానీ.. అటు సామ్ కానీ నోరు తెరవలేదు.

అందుకే మీడియా టైమ్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ విడుదల రూపంలో ఆ టైమ్ వచ్చేసింది. ఈ నెల 24న లవ్ స్టోరీ విడుదల. ఈరోజే ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచాలని మరింతగా పెంచేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చేయాలని చిత్రబృందం భావించడం లేదు. కానీ హీరో ఒకట్రెండు సార్లు మీడియా ముందుకొచ్చి… సినిమాకు సంబంధించిన విషయాలని పంచుకోవడం పరిపాటి. అలా మీడియా ముందుకొచ్చిన చైతూని సామ్ తో వస్తున్న వార్తలపై కడిగేయక మానదు. పర్సనల్ విషయాలని పబ్లిక్ గా పంచుకోవడం ఇష్టం లేని చైతూ.. ఏ మేరకు ఓపెన్ అవుతారు ? అన్నది కూడా డౌటే. ఏమైనా ఉంటే.. పేలితే ముందు సామ్ నే పేలాలి అంటున్నారు.