టికెట్ల అమ్మకం వెనక టాలీవుడ్ భయం, భక్తి

సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టికెట్ల అమ్మకాల కోసం సరికొత్త పోర్టల్ ని తీసుకొస్తామని ప్రకటించింది. ఇది ఒక రకంగా టాలీవుడ్ ని భయపెట్టడం లాంటిదే అంటున్నారు. కానీ ఎవ్వరు  బయటపడటం లేదు. మౌనం వహిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏమైపోతామో.. అన్న భ‌యం వాళ్ల‌ది. సినిమా వాళ్ల‌కు వ్యాపారాలున్నాయి. భూములున్నాయి. లోలోప‌ల లొసుగులు చాలా ఉన్నాయి. అందుకే జగన్ సర్కారు నిర్ణయంపై ఏమీ అనడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి.. ఏమైనా అన్నా జగన్ తగ్గే మనిషి కాదు. అనుకున్నది చేసి తీరుతాడు. ఆ క్లారిటీ టాలీవుడ్ కు ఉంది.

ఈ వ్య‌వ‌హారంపై ఎవరో ఒకరు కోర్టుకెళ్ల‌డం ఖాయం. కోర్టు జ‌గ‌న్ స‌ర్కారుకి మొండి చేయి చూపించ‌డం ఇంకా గ్యారెంటీ అన్న న‌మ్మ‌కాలూ ఉండొచ్చు. అలాంట‌ప్పుడు ఇప్పుడు గొడ‌వ ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న న‌మ్మ‌కంతోనే ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. అందుకే.. టికెట్ల అమ్మ‌కానికి త‌లూపేసి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసే ప్ర‌య‌త్నాలు చేసినా చేస్తున్నారని టాక్. టికెట్ల విషయంలో సినిమా వాళ్లకు చాలా భయం ఉన్నా.. సీఎం జగన్ ముందు మాత్రం భక్తిని ప్రదర్శిస్తున్నారు.