ఉత్తేజ్ భార్య కన్నుమూత

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న భార్య ప‌ద్మాప‌తి ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ప‌ద్మావ‌తి కేన్స‌ర్ తో బాధ ప‌డుతున్నారు. ఆమెకి హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప‌రిస్థితి విషమించ‌డంతో.. ప‌ద్మావ‌తి క‌న్నుమూశారు. ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు సినీ ప్రముఖులు బసవతారకం హాస్పటల్ కి చేరుకొని ఉత్తేజ్ ని పరామర్శించారు. సంతాపం తెలియజేశారు.

ఉత్తేజ్ ఇటీవ‌ల ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. ఆ ఇనిస్టిట్యూట్ అడ్మినిస్ట్రేష‌న్ మొత్తం ప‌ద్మావ‌తి చూసుకునేవారు. అయితే ఇప్పుడు స‌డ‌న్ గా కాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆమెని క‌బ‌ళించింది. ఉత్తేజ్‌కి చేత‌న‌, పాట అనే ఇద్ద‌రు కూతుళ్లు. పెద్ద కూతురు చేత‌న సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ సినిమాలో హీరోయిన్ గానూ చేసింది.

‘శివ’ సినిమాతో నడుడిగా ప్రస్థానం మొదలెట్టిన ఉత్తేజ్.. ‘ప్రెషర్ కుక్కర్’ వరకు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తేజ్ మంచి నటుడు మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. పలు చిత్రాలకు సంభాషణలు అందించారు. ఇతర నటులని తన గాత్రం అందించారు. ప్రస్తుతం ఫిల్మ్ ఇన్సిట్యూట్ స్థాపించి.. నటనలో శిక్షణ ఇస్తున్నాడు.