కాదన్న త్రిషనే కావాలట

ఆచార్య సినిమా కోసం తొలుత త్రిషనే అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమె డ్రాప్ కావడంతో కాజల్ వచ్చి చేరింది. త్రిష తప్పుకోవడంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. చివరికి మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇస్తే గానీ.. ఆ వ్యవహారానికి పులిస్టాప్ పడలేదు. అప్పుడు కాదన్న త్రిషనే మళ్లీ కావాలంటున్నారు చిరు. చిరంజీవి-మెహర్ ర‌మేష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. భోళా శంక‌ర్‌ అనే పేరు పెట్టారు. చిరు చెల్లెమ్మ‌గా.. కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇప్పుడు చిరు ప‌క్క‌న క‌థానాయిక‌నే ఖ‌రారు చేయాలి. ఆ ఛాన్స్ త్రిష‌కే ఎక్కువ ఉంద‌ని సమాచారమ్.

మరోవైపు బాలయ్య కూడా త్రిషనే కోరుకుంటున్నాడు. బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. వ‌చ్చే నెల‌లో ప్రారంభిస్తారు. క‌థానాయిక‌గా త్రిష పేరు అనుకుంటున్నారు. రూల‌ర్‌లో బాల‌య్య‌తో త్రిష జోడీ క‌ట్టింది. ఆ సినిమా ఫ్లాప్‌. అయినా స‌రే, త్రిష‌ని మ‌రోసారి రంగంలోకి దింపాల‌ని ఫిక్స‌య్యారట. ఒకేసారి చిరు, బాలయ్య త్రిషని కోరుకుంటున్నారు. మరీ.. ఇద్దరిలో త్రిష ఎవరికి ఓకే చెప్పనుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరికీ ఓకే చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ? ప్రస్తుతం త్రిష చేతిలో తమిళ సినిమాలు కూడా పెద్దగా లేవు.