చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. అన్ని విధాల అండగా ఉంటానని హామీ !

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొని దారుణంగా శిక్షించాలి. ఉరిశిక్ష విధించాలని ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చైత్ర కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. చిన్నారి కుటుంబ సభ్యులని పరామర్శించారు.

“ఇది మనసుని కలిచివేసే ఘటన. జనసేన సోషల్ మీడియా విభాగం ద్వారా ఈ ఘతన గురించి తనకు తెలిసిందే. బాధిత కుటుంబానికి ఇంకా న్యాయం జరగలేదు. చిన్నారి కుటుంబం పుట్టడు దుఖంలో ఉందని తెలిపారు. చిన్నారి చైత్రని చెప్పుకోలేని విధంగా.. సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా.. ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగింది. ఇంట్లో నుంచి ఆడుకోవడానికి వెళ్లిన బిడ్డ.. కనిపించకుండా పోయే సరికి.. తల్లిదండ్రులు, మామయ్యలు, కుటుంబం అంతా.. బిడ్డ ఏమైందని.. వినాయక చవితి అని పండగల దగ్గరకు పోయారు. ట్యాంక్ బండ్ దగ్గరకుపోయారు. వారికి ఓ యువకుడి మీద సందేహం వచ్చి వెళ్లి చూసిన పరిస్థితుల్లో దారుణం చూడాల్సి వచ్చింది. చైత్ర చిన్నారికి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం” అని పవన్ హామీ ఇచ్చారు.