తేజుని పరామర్శించిన బన్నీ

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ అపోలో హాస్పటల్ కి వచ్చారు. చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ని పరామర్శించారు. గత శుక్రవారం తేజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అపోలో హాస్పటల్ లోనే చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన రోజున మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో హాస్పటల్ కి వచ్చింది. ఆ తర్వాత కూడా తేజుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 

అయితే పుష్ప షూటింగ్ కోసం అల్లు అర్జున్ బయటికి వెళ్లారు.
కొన్నాళ్లుగా పుష్ప షూటింగ్ ఏపీలోని గోకవరం ప్రాంతంలో పుష్ప షూటింగ్ జరిగింది. ఇప్పుడీ.. ఈ షెడ్యూల్ పూర్తయింది. దీంతో హైదరాబాద్ చేరుకున్న బన్నీ తేజుని పరామర్శించడానికి అపోలో హాస్పటల్  కి వెళ్లారు. ఆదివారం కాలర్‌ బోన్‌ సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.