ప్రభాస్ తర్వాత తారక్ నే !

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్స్ ని వరుసగా లైన్ లో పెట్టేశారు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జునలకి కథలు వినిపించారు. ఇప్పటికే ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని సమాచారమ్.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఎన్టీఆర్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కాగా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇక ‘NTR30’గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించనున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కల్యాణ్‌ రామ్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమా అక్టోబరు తొలి వారంలో లాంఛనంగా మొదలు కానుందని సమాచారం. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. కథానాయికగా అలియా భట్‌ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయనున్నారు.