కొత్త దర్శకుడుకి సామ్ గ్రీన్ సిగ్నల్

స్టార్ హీరోయిన్ సమంత ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ఇటీవల ముంబైలో ఓ ఇల్లు కూడా కొనేసింది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనుంది. అక్కడ ఒకట్రెండు సినిమాలు చేసి.. తన సత్తా చాటనుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో సామ్ షాక్ ఇచ్చింది. ఓ తెలుగు సినిమాని ఓకే చేసింది. కథ వినగానే సమంత వెంటనే పచ్చ జెండా ఊపేసి, నవంబర్ నుంచి కాల్ షీట్లు కేటాయించేసిందట. అది కూడా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకి సామ్ పడిపోవడం విశేషం. అది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఇంతవరకు తెలుగు తెరపైనే కాదు, ఇతర ఏ భాషలోనూ రాని కథాంశమట. అందుకే సామ్ ఫిదా అయిపోయింది. వెంటనే ఓకే చెప్పేసింది.

ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య369’, ‘వంశానికొక్కడు’, నానితో ‘జెంటిల్మెంట్’, సుదీర్ బాబు తో ‘సమ్మోహనం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఈ బ్యానర్ లో వచ్చిన సంగతి తెలిసిందే.