ఎన్టీఆర్ తో మహేష్.. వైరల్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటిశ్వరుడు’ షోకి మహేష్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఏపీసోడ్ ని ఆదివారం షూట్ చేశారు. అంతేకాదు.. ఓ పిక్ కూడా బయటికి లీకైంది. వేదిక మీదకు మహేష్ ని తారక్ ఆహ్వానిస్తున్న పిక్ అది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ కలయిక కేక అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ ఏపీసోడ్ ని ప్రసారం చేయనున్నారని సమాచారమ్.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని పూర్తి చేసుకున్న తారక్.. తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా జెట్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సర్కారువారి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.