టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన పలు చిత్రాలకు పోస్టర్లు తయారు చేసి.. అందరి మన్ననలు అందుకున్నారు. ‘సాక్షి’ సినిమా కలర్‌ పోస్టర్లు, లోగోను ఆయనే రూపొందించారు. బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌తో ‘పాప కోసం’ చిత్ర పోస్టర్ల రూపకల్పన చేశారు. హిందీ, తమిళ వెర్షన్లకు అదేరకం పోస్టర్ల రూపకల్పనతో గుర్తింపు పొందారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఈశ్వర్‌కు చిన్నతనం నుంచి బొమ్మలు గీయడమంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే వంశపారంపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వృత్తిలోకి అడుగుపెట్టారు. ఆర్టిస్ట్‌ కేతా వద్ద పోస్టర్‌ డిజైనింగ్‌లో మెళకువలు నేర్చుకుని ‘ఈశ్వర్‌’ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు.  ‘సాక్షి’ సినిమా కలర్‌ పోస్టర్లు, లోగోను ఆయనే రూపొందించారు. బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌తో చేయడం ఈశ్వర్ ప్రత్యేకత.