ట్రైలర్ టాక్ : రిపబ్లిక్

దేవకట్టా దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో తేజ్‌ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అక్టోబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ను బుధవారం ఉదయం చిరంజీవి విడుదల చేశారు.

తేజు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. అక్టోబర్ 1నే ‘రిపబ్లిక్’ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందన్న సాయి తేజ్‌ కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతోంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయిధరమ్‌కు శ్రీరామ రక్ష అని చిరు అన్నారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్‌’ అంటూ తేజు చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. ప్రజాస్వామ్య రాజ్యంలో అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ తో అర్థమవుతోంది.