ప్రభాస్-పూజా హెగ్డేల మధ్య గొడవ.. ఇదీ నిజం !

ప్రభాస్‌-పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అపురూప ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రభాస్, పూజాలకు అస్సలు పడటం లేదు. వీరిద్దరి మధ్య మాటలు లేవు. మాట్లాడుకోవడం లేదనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతుంది.

తాజాగా ఈ ప్రచారంపై  ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారని.. ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని టీమ్‌ చెప్పింది. ఆఫ్‌స్క్రీన్‌లో వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహబృందం ఉందని.. ఆ బంధమే ఆన్‌స్క్రీన్‌లోనూ కొనసాగిందని వివరించింది. పూజా చక్కని సమయపాలన పాటిస్తుందని.. చెప్పిన సమయానికి సెట్‌లో ఉంటుందని.. ఆమె మంచి నటి అని టీమ్‌ వివరించింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా ! అసలు ప్రభాస్-పూజాల మధ్య గొడవకు కారణలేంటీ ? వీరిద్దరిలో ఒకరు మనసు జారారా ? ప్రేమలో ఏమైనా పడ్డారా ?? అనే కొత్త డౌట్లని తెరమీదకు తెస్తున్నారు.