‘లవ్ స్టోరీ’తో ఏం చెప్పబోతున్నారంటే ?

నాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవి పర్సనల్, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. అసలు లవ్ స్టోరీతో శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నారు ? అనే విషయాన్ని వివరించింది.

“‘లవ్‌స్టోరీ’ సినిమాలో రేవంత్‌, మౌనికల పాత్రల ద్వారా దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ మంచి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. సమాజంలోని అసమానతలు, లింగ వివక్ష లాంటి అంశాలను చర్చించారు. మనలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు.. మాస్టర్స్‌ కాదు.. కానీ, ప్రయత్నించి సాధించాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా రేవంత్‌, మౌనిక పాత్రలు తమ కలల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాయి? ఎదురైన సవాళ్లేంటి? అన్నది ఆసక్తికరం. ఇందులో రేవంత్‌గా చైతన్య నటించగా.. మౌనిక పాత్రను నేను పోషించా”నని సాయి పల్లవి చెప్పింది.