మహా సముద్రం.. భావోద్వేగాల ప్రయాణం

అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అను ఇమ్మానుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. గురువారం మహాసముద్రం ట్రైలర్ ని విడుదల చేశారు. భావోద్వేగాల ప్రయాణం.. ఓపెన్‌ డ్రామాతో కూడిన ఓ ప్రేమకథ. యాక్షన్‌ సమ్మేళనంగా తెరకెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది.

ట్రైలర్ లో వినిపించిన ప్రతి మాట, కనిపించిన ప్రతీ సీన్ అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్ సినిమా రిచ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ట్రెండ్ సినిమా లక్షణాలన్నీ మహా సముద్రం ట్రైలర్ లో కనిపించాయి. మరీ.. సినిమా ఆ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రం అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

youtu.be/khbpC9joyoY