బిగ్ బాస్ 5 : నామినేషన్ లోకి సగం మంది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతగా మూడు వారాలని పూర్తి చేసుకుంది. నాల్గో వారంలోకి అడుగుపెట్టేసింది. సోమవారం నాల్గోవారానికి సంబంధించిన ఎలిమినేషన్ కి నామిషన్ ప్రక్రియ ఆసక్తిగా సాగింది. ఇంట్లో ఉండేందుకు అర్హతలేని ఇద్దరు వ్యక్తులను ఎంచుకుని, తగిన కారణాలు చెప్పి వారి ఫొటోలోని కొంత భాగాన్ని తీసి స్విమ్మింగ్‌ పూల్‌లో పడేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. లోబో-ప్రియల మధ్య గట్టి వాదనే జరిగింది. విశ్వ-నటరాజ్‌ల మధ్య కూడా మాటల తీవ్రత బాగానే సాగింది.

అత్యధికమంది లోబోను నామినేట్ చేయగా, ఆ తర్వాత నటరాజ్‌, రవి, ప్రియ, కాజల్‌, సిరి, సన్నీ, అనీలు నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో 16మంది సభ్యులు ఉండగా, 8మంది అంటే సగం మంది ఈ వారం నామినేషన్స్‌లో ఉండటం గమనార్హం.