ఐపీఎల్2021 : నాల్గో బెర్తు కోసం నాలుగు జట్లు పోటీ

ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు అవుతున్నాయి. ఇప్పటికే ఎనిమిదేసి విజయాలు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే. 10 మ్యాచ్‌లాడి 6 విజయాలు సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌కు చేరువలోనే ఉంది.

మిగతా 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ఆ జట్టు ముందంజ వేస్తుంది.ఇక నాలుగో బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌, కోల్‌కతా.. ఈ నాలుగు జట్లూ 10 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో సమాన స్థితిలో ఉన్నాయి. మరి ఈ నాలుగు జట్లలో నిలకడగా ఆడి ప్లేఆఫ్స్‌ బెర్తు సాధించే జట్టేదో చూడాలి.