ముంబై సమస్య అదే

ఐపీఎల్ 2021 పార్టు1లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. కానీ దుబాయ్ వేదికగా జరుగుతున్న పార్టు2లో మాత్రం ముంబై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీనిపై ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ స్పందించారు.

“మా జట్టు బ్యాటింగ్‌ బాగానే ఉంది.. కానీ మిడిలార్డర్‌ విఫలం కావడంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఆర్సీబీతో మ్యాచ్ లో అదే జరిగింది..శుభారంభం లభించిన తర్వాత వరుస వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టం. ప్రస్తుత సీజన్లో ముంబయి పరిస్థితి అంత ఏం బాగోలేదు. ప్లేఆఫ్‌ ఆశలు నిలవాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఇందుకోసం జట్టు కలిసికట్టుగా ఆడాలి. ముంబయి అంటే దూకుడైన ఆటకు పేరు. కానీ ఈ సీజన్లో జట్టులో లోపించింది ఆ దూకుడే” అని జహీర్‌ అన్నారు.