సామ్ డబ్బు మనిషి

నాగచైతన్య-సమంత పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేశారు. ఫైనల్ గా ఈ క్యూట్ కపుల్స్ విడిపోయారు. తమ వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు నాగచైతన్య – సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భరణంగా సమంతకు భారీగా ముట్టనుంది. దాదాపు రూ. 300కోట్లు దక్కనుంది అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.

వాస్తవానికి భర్తతో విడిపోయిన భార్యకు భరణం దక్కాల్సిందే. అక్కినేని ఫ్యామిలీ కూడా సామ్ కు భరణంగా రూ. 200కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. అదనంగా మరో రూ. 50కోట్లు కూడా ఇస్తామని చెప్పారట. కానీ ఆ మొత్తానికి తీసుకునేందుకు సామ్ నో చెప్పేసిందట. తనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. డబ్బుని తాను సంపాదించుకోగలను అని చెప్పిందట. సామ్ స్టార్ హీరోయిన్. సినిమాలు, ప్రకటనలతో రెండు చేతుల్లా సంపాదించే సామర్థ్యం ఆమెకు ఉంది. అందుకే సామ్ భరణం వద్దని చెప్పేసింది. అంతేకాదు.. అసలు సామ్ డబ్బు మనిషి కాదు. అక్కినేని ఫ్యామిలీలో స్వేచ్ఛ లేదు. ఆధిపత్యం వహిస్తున్నారనే ఆమె విడాకులు తీసుకున్నట్టు సమాచారమ్.