మళ్లీ పెరుగుతున్న కేసులు

గత రెండు రోజులుగా 20 వేల దిగువన నమోదైన కేసులు.. తాజాగా ఆ మార్కును దాటాయి. మృతుల సంఖ్య కూడా 300పైనే నమోదైంది. గడిచిన 24 గంటల్లొ 22,431 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కేసుల్లో 19 శాతం మేర పెరుగుదల కనిపించింది. నిన్న 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.38 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.49 లక్షలకు చేరింది.

అలాగే ఒక్క కేరళలోనే 12 వేల కేసులు, 134 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 2.44లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.72 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.95 శాతానికి చేరింది. నిన్న 24 వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3.32 కోట్లకు చేరింది.