ప్లేఆఫ్స్‌కు కోల్ కతా

ఐపీఎల్ 2021 ప్లేఆఫ్స్‌ చేరే నాలుగో జట్టేదో తేలిపోయింది. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా అదిరే ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో రాజస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ.. దిల్లీ, చెన్నై, బెంగళూరు తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌ సమరానికి సిద్ధమైంది.

శుభ్‌మన్‌ గిల్‌ (56; 44 బంతుల్లో 4×4, 2×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (38; 35 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో మొదట కోల్‌కతా 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ త్వరగానే చేతులెత్తేసింది. శివమ్‌ మావి (4/21), ఫెర్గూసన్‌ (3/18), వరుణ్‌ చక్రవర్తి (1/14) ధాటికి 16.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. తెవాతియా (44) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.