‘కొండపొలం’ మెగా రివ్యూ వచ్చేసింది

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ఓ న‌వ‌ల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌రిచాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి తొలి రివ్యూ వ‌చ్చేసింది. కొండ‌పొలం చిత్రాన్ని చిరంజీవి కోసం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమా చూసిన వెంట‌నే చిరు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“ఇప్పుడే కొండ‌పొలం చూశాను. గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని అందంగా ప్ర‌తిబింబిస్తూ, చ‌క్క‌టి సందేశం ఇచ్చారు.క్రిష్ ప్ర‌తీసారీ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం, న‌టీన‌టుల నుంచి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకోవ‌డం చూస్తుంటే ఆనందం క‌లుగుతోంది. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని, అవార్డుల్ని, రివార్డుల‌నీ అందుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంద“ని చిరు ట్వీట్ చేశారు. ఇక సినిమా చూసిన నెటిజన్స్ కొండపొలం.. ఓ మినీ జంగిల్ బుక్ లా ఉందని ట్విట్ చేస్తున్నారు.