నాగబాబు షాకింగ్‌ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతునిస్తున్న మెగా నటుడు నాగబాబు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పవన్‌-పోసాని మధ్య జరిగిన వార్‌ ఆఫ్‌ వర్డ్స్‌పై స్పందించారు.

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా అన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం. మా అన్నయ్య ఏం చెప్పినా మేము ఫాలో అవుతాం. ‘రిపబ్లిక్‌’ వేడుకలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు అన్నయ్య విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. కానీ.. అన్నయ్య ప్రత్యక్షంగా చెప్పలేదుగా?. కొన్ని వ్యక్తిగత ఆరోపణలు మినహాయిస్తే సినీ ఇండస్ట్రీ సంక్షేమం కోసమే పవన్‌ అలా మాట్లాడాడు. తమ్ముడు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నానని నాగబాబు అన్నారు.

ఇక పోసాని-పవన్‌ కాంట్రవర్సీపై స్పందించమని విలేకరి కోరగా.. ‘ఆ వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదు’ అని ఆయన స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ఇక చివరగా సీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. ‘ఆ వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదు’ అన్నారు.