రాజ‌మౌళి, ర‌వితేజ లేకుండానే ‘విక్రమార్కుడు2’ ?

రాజ‌మౌళి-ర‌వితేజ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘విక్రమార్కుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ.. ఈ సినిమా సీక్వెల్ రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విక్ర‌మార్కుడు 2 క‌థ‌ని ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ సిద్ధం చేశారు. అయితే రాజ‌మౌళి కోసం కాదు. ఓ నిర్మాత కోసం. ఆ నిర్మాత ఈ క‌థ‌ని సంప‌త్ నందితో తెర‌కెక్కించాల‌ని చూస్తున్నాడు.

హీరోగా ర‌వితేజ‌ కాదట. మరో హీరోతో అనుకుంటున్నారు. నిజానికి రవితేజని అడిగారు. కానీ ఆయన ఫుల్ బిజీ. దీంతో మరో హీరోతో ప్లాన్ చేసుకుంటున్నారు. అలా హీరో, ద‌ర్శ‌కుడు మారితే.. విక్ర‌మార్కుడు 2 అనే టైటిల్ ఉంటుందా ? లేదా? అనేది అనుమానం. ఎందుకంటే ఇద్ద‌రిలో ఎవ‌రు మారినా, అదే టైటిల్ తో సినిమా చేయ‌డం అన‌వ‌స‌రం. విక్రమార్కుడు స్టయిల్ లోనే సీక్వెల్ కథని రాశాడట విజేంద్రప్రసాద్. అలాంటి ఫ్లో రావాలంటే రవితేజ హీరో అవ్వడం కంపల్సరీ. మరికొన్నాళ్లు ఆగితే.. విక్రమార్కుడు 2 పూర్తి డిటేల్స్ తెలియనున్నాయి.