నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత మహేశ్‌ కోనేరు కన్నుమూశారు. ఈ ఉదయం విశాఖలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.  ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌కు మహేశ్‌ కోనేరు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో తెలుగులో పలు చిత్రాలను ఆయన నిర్మించారు. 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ కొనేరు సడెన్ డెత్ తో టాలీవుడ్ షాక్ కి గురవుతుంది. 

మహేశ్‌ కోనేరు మృతి వార్త తెలిసి షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్‌ అన్నారు. ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేశ్‌ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. మహేశ్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా” అని తారక్ ట్విట్ చేశారు.