‘పవన్-విష్ణు’లపై నెటిజన్స్ ఫైర్

గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ నిర్వహించిన ‘అల‌య్‌బ‌ల‌య్’ కార్య‌క్ర‌మంలో ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, ప్ర‌జాసంఘాల ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఇటీవ‌ల ‘మా’ అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఒకే వేదిక‌పై ఈ ఇద్ద‌రు సినీ ప్ర‌ముఖులు ప‌ర‌స్ప‌రం ప‌ల‌క‌రించుకోడానికి కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. ప‌క్క‌ప‌క్క‌నే కూచున్నా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌రువ‌య్యాయి. మౌనం రాజ్య‌మేలింది. ఒక ద‌శ‌లో ప‌వ‌న్‌తో మాట్లాడేందుకు విష్ణు ప్ర‌య‌త్నించినా, ఆయ‌న నుంచి క‌నీస సానుకూల‌త కూడా వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

మరోవైపు ఇదే వేదిక‌పై రాజ‌కీయంగా బ‌ద్ద‌శ‌త్రువులైన తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.క‌విత ప‌క్క‌ప‌క్క‌నే ఆసీనుల‌య్యారు. ఇద్ద‌రు నేత‌లు హాయిగా మాట్లాడుకుంటూ క‌నిపించారు. రాజ‌కీయంగా క‌త్తులు దూసుకునే వేర్వేరు పార్టీల‌కు చెందిన ఈ ఇద్ద‌రు నేత‌లు …అవేవీ ప‌ట్టించుకోకుండా స్నేహ‌పూర్వ‌కంగా మెల‌గ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతున్న సంద‌ర్భంలో ఇద్ద‌రు నేత‌లు న‌వ్వుతూ మాట్లాడుకోవ‌డం ఆక‌ర్షించింది. ఈ రెండు దృశ్యాల‌ను నెటిజ‌న్లు పోలుస్తూ… మంచు విష్ణు, ప‌వ‌న్‌ల‌పై ట్రోల్ చేస్తున్నారు. కనీస సంస్కారాన్ని ప్ర‌ద‌ర్శించ‌క పోవ‌డం దేనికి సంకేత‌మ‌ని తిట్టిపోస్తున్నారు.