మళ్లీ పెరిగిన మృతుల సంఖ్య

దేశంలో కరోనా ఉదృతి బాగా తగ్గింది. కానీ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ముందురోజు 13 వేలకు పడిపోయిన కేసులు.. తాజాగా 14,623కి చేరాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 14,623 కొత్త కేసులు నమోదయ్యాయి. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 19,446 మంది కోలుకున్నారు. దీంతో  కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. అందులో 3.34 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 4,52,651 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098కి తగ్గింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది.