కాళ్లకు దండం పెట్టొద్దన్న ఎన్టీఆర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అదుర్స్. సినిమాల్లోనే కాదు… టీవీ షోస్ లోనూ తారక్ తనదైన శైలిలో నవ్వులు పంచుతున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కోసం ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ ని తీసుకెళ్లి ఓ రేంజ్ లో నిలబెట్టారు. తాజాగా ఎన్టీఆర్‌ హోస్ట్ గా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu). ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి ఫుల్ క్రేజ్ ని తీసుకొచ్చారు తారక్. ఎప్పుడు సామాన్యులే కాదు.. మధ్యలో సెలబ్రెటీలని హాట్ సీటులో కూర్చోబెట్టి షోని రక్తికట్టిస్తున్నారు. 

ఇటీవల దసరా సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ‘చాంప్స్‌ ఎలీసే మార్గంలో నడిచి, ఏ నగరంలో ఆర్క్‌ డి ట్రియోంఫ్‌ని చూడవచ్చు’ అన్న ప్రశ్నకు సమంత సరైన సమాధానం గుర్తించలేకపోయారు. దీంతో 50:50 ఆప్షన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ‘పారిస్‌’ ఆప్షన్‌ నుంచి ఎంచుకోగా, వేదిక మొత్తం నిశ్శబ్దమైపోయింది. సమంత తెగ టెన్షన్‌ పడిపోగా, ఆమెను ఎన్టీఆర్‌ కాసేపు ఆటపట్టించారు. ‘పారిస్‌ వెళ్తే ఎంతసేపూ షాపింగ్‌ చేసుకుంటూ, ఐఫిల్‌ టవర్‌ చూసేసి, బాగా బ్యాగులు కొని వచ్చేసుంటారు’ అని అనేసరికి సమంత నవ్వేసింది. ‘పారిస్‌’ సరైన జవాబు అని చెప్పడంతో ఆనందపడిపోయింది. నీకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా నా కాళ్లకు నమస్కారం పెట్టడం. నా ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజలు చేయటం చేయొద్దు అంటూ తారక్ అనే సరికి షోలో నవ్వులు పూశాయి.