మహేష్-రాజమౌళి సినిమా దిల్ రాజు చేతుల్లోకి ?

ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్.. తరువాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేస్తారు. దీనికి నిర్మాత కేఎల్ నారాయణ. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ ప్రాజెక్ట్ లోకి మరో నిర్మాత కూడా జాయిన్ అయ్యే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బడ్జెట్ అయిదారు వందల కోట్లు వుంటుంది. పైగా ప్రొడక్షన్ పూర్తిగా చూసుకోవాలి. దానికి చాలా వ్యయ ప్రయాసలు వుంటాయి. కేఎల్ నారాయణ ప్రొడక్షన్ చేసి చాలా కాలం అయింది. అందుకే నిర్మాత దిల్ రాజును ఈ ప్రాజెక్టులో జాయిన్ చేస్తారని వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉంటే.. ఆ సినిమా పనులన్నీ ఆయన చేతుల మీదుగానే సాగుతాయి. ఈ లెక్కన మహేష్–రాజమౌళి సినిమా దిల్ రాజు చేతుల్లోకి వచ్చేసినట్టే.