ప్రభాస్ సినిమా వడ్డీ భారమే 60 కోట్లు?

బాహుబలి ప్రభాస్ సినిమాకు కోట్ల వడ్డీ అయి కూర్చోందని తెలుస్తోంది. సాహో తర్వాత రాధేశ్యామ్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు ప్రభాస్. ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. యూవీ, గోపీ కృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు కరోనా దశలు చూసిన సినిమా ఇది. ఎప్పటికి అయినా విడుదల అవుతుందా? అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసిన సినిమా. అలాంటి సినిమా మరో రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా కోసం మూడు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని వార్తలు వున్నాయి. ఎంత స్వంత పెట్టుబడి, ఎంత ఫైనాన్స్ అన్న వివరాలు తెలియవు కానీ యువి సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద యాభై నుంచి అరవై కోట్లు వడ్డీలకు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా పెట్టుబడి+వడ్డీతో పోనూ లాభాలు వస్తాయని నిర్మాతలు ఆశపడుతున్నారు.