లైగర్.. కోసం బాలయ్య

సక్సెస్స్ ఫుల్ డైరెక్టర్ పూరి జగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  ‘లైగర్’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ , అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే లాస్ వెగాస్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని , మరో షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంటుందని సినీ వర్గాల సమాచారం. ‘లైగర్’  వచ్చే ఏడాదిలోప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫూరి, బాలకృష్ణ  కాసేపు తెరపై మెరిసేలా పూరి ఒక ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు  జరిగిపోయాయట. ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరిస్తే, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మైలేజ్ వస్తుంది. అందువలన పూరి రిక్వెస్ట్ చేయడం .. బాలకృష్ణ అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. ‘పైసా వసూల్’ సినిమా నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.