చెన్నైలో దిగిపోయిన ‘పుష్ప’రాజ్

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ ల హ్యాట్రిక్ చిత్రమిది. ఇప్పటికే ట్రైలర్ అదిరిపోయింది. ఇక్కో పాట ఒక్కో ఆణిముత్యం. మాస్ ను మురిపించేలా, మత్తెక్కించేలా ఉన్నాయి. ఇప్పుడు ‘పుష్ప’ కోసం బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అన్నీ చోట్ల సినిమా ప్రమోషన్స్ కి చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా పుష్పరాజ్ (అల్లు అర్జున్) చెన్నైలో దిగిపోయారు. అక్కడ నిర్వహించనున్న పుష్ప ఈవెంట్ లో పాల్గొనున్నారు. పుష్పకి మద్దతుగా కోలీవుడ్ స్టార్స్ ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉంది. 


ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. మలయాళ స్టార్ ఫాహిద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఇప్పటికే రిలీజైన ‘ఊ అంటావా మావా ? ఊ ఊ అంటావా మావా ?’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాన్ని బిగ్ స్కీన్ పై చూస్తే ప్రేక్షకులకు పూనకాలు రావడం గ్యారెంటీ. పాన్ ఇండియా సినిమాగా రెండు పార్టులుగా రాబోతున్న పుష్ప పార్ట్ -1 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.