ఐష్’కు ఈడీ నోటీసులు

బాలీవుడ్ లో మరో కుదుపు. బిగ్ బీ అమితాబ్ కోడలు, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ  సమన్లు జారీ చేసింది. పనామా పేపర్‌ లీక్‌ కేసులో తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపింది.

ఇప్పటికే పనామా లీక్‌ కేసులో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ పనామా పేపర్స్ కేసులో 500మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు సమాచారం. ఇందులో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. 

ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు గానూ ప్రత్యామ్న్యాయాలను ఎన్నుకోవడమే దీనికి కారణమని తెలుస్తున్నది. ఇక నెల క్రితం అభిషేక్ బచ్ఛన్ కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. అతి త్వరలో అమితాబ్ బచ్ఛన్ కు కూడా ఈడీ నోటీసులు అందుతాయని సమాచారం.