‘రామానుజాచార్య‌’గా బాలయ్య.. దర్శకుడు ఎవరో తెలుసా ?

‘రామానుజాచార్య‌’ క‌థకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రచయిత భార‌వి ఈ కథని రెడీ చేస్తున్నారు. సి. కల్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. కావాల్సిందే దర్శకుడే. ఈ సినిమాకి కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇలాంటి క‌థ‌ని మెప్పించే ద‌ర్శ‌కుడు ఆయ‌నొక్క‌డే.

భార‌వితో ఆయ‌న‌ది సుదీర్ఘ ప్ర‌యాణం. ఇద్ద‌రిదీ హిట్ కాంబినేష‌న్‌. కాబ‌ట్టి.. ఈ ప్రాజెక్టు రాఘ‌వేంద్ర‌రావే డీల్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం రాఘ‌వేంద్ర రావుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

బాల‌కృష్ణ – రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో.. ‘పాండు రంగ‌డు’ వ‌చ్చింది. కానీ అది ఫ్లాప్‌. ఈసారి ‘రామానుజాచార్య‌’ని జాగ్ర‌త్త‌గా చేయాల్సి ఉంటుంది. కథ పూర్తిగా సిద్ధ‌మ‌య్యాక‌.. బాల‌య్య-రాఘ‌వేంద్ర‌రావు ల మ‌ధ్య చ‌ర్చ‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర‌వాత‌.. ఈ సినిమాని ఎప్పుడు? అన్నది క్లారిటీ రానుంది.