బోయపాటి-మైత్రీ.. సినిమా ఫిక్స్

ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను మైత్రీ మూవీస్ బ్యానర్ కు ఓ సినిమా బాకీ ఉన్నారు. ఎప్పుడో అడ్వాన్స్ ముట్టింది. అయితే సరైన హిట్ లేని బోయపాటిని మైత్రీ కావాలనే పట్టించుకోలేదనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అఖండ విజయంతో అంతా మారిపోయింది. మైత్రీ బ్యానర్ లో బోయపాటి సినిమా ఫిక్స్ అయిపోయింది.

హీరో ఎవరు అన్నది తరువాత సంగతి. ఇక్కడ ఏదైనా సక్సెస్ నే మాట్లాడుతుంది. బోయపాటి కోసం ఎన్ టీఆర్, మహేశ్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.. ఎవరు ఖాళీగా లేరు. మరీ.. ఏ హీరోతో మైత్రీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడు అన్నది వేచి చూడాలి.