ఈ క్రిస్మస్‌ మనదే

రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదలకానున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తదుపరి సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చారు.

‘అంటే సుందరానికీ!’ తుది దశ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మరో చిత్రం ‘దసరా’ త్వరలోనే ప్రారంభంకానుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ తెరకెక్కించనున్నారని చెప్పారు. ఇక ”శ్యామ్‌ సింగరాయ్‌’ కథపై ఉన్న నమ్మకం, అనుకోకుండా చెప్పిన మాట పాపులర్‌ అవడంతో ‘ఈ క్రిస్మస్‌ మనదే’ అంటూ ప్రచారం చేస్తున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు.