పవన్ కు అవమానం.. నొచ్చుకున్న త్రివిక్రమ్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అవమానం జరిగింది. దానికి ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ కూడా నొచ్చుకున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ? సంక్రాంతి కానుకగా జనవరి 12న రావాల్సిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అంతా తానై త్రివిక్రమ్ పని చేశారు. పవన్ ని ఒప్పించారన్నది ఇండస్ట్రీ ఎరిగిన నిజం. అయితే ఒడ్టు దాటే వరకు ఓడ మల్లన్న..దాటేసాక బోడి మల్లన్న వైఖరిని రాజమౌళి అనుసరించినట్టు కనిపిస్తున్నది.

భీమ్లా నాయక్ వాయిదా విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన తర్వాత.. రాజమౌళి రెండు ట్విట్లు చేశారు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను రాజమౌళి తెలివిగా బరిలోకి లాగారు. మహేష్ కు థ్యాంక్స్ చెప్పారు. భీమ్లా నాయక్ వాయిదా పై తన థాంక్స్ చెప్పాలి కదా. అందుకోసం వేసిన ట్వీట్ చాలా మొక్కుబడిగా వుంది. పవన్ కు ట్విట్టర్ అక్కౌంట్ వుందని కూడా రాజమౌళికి తెలియదా? పైగా నిర్మాత చినబాబు పేరు ముందు వేసి, వెనుక పవన్ పేరు వేయడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

“పండగ నుంచి తప్పుకోవాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టిన మహేశ్‌ బాబుకి కృతజ్ఞతలు. సర్కారివారిపాట పర్ఫెక్ట్‌ పొంగల్‌ సినిమా అయినప్పటికీ సమ్మర్‌ ప్లాన్ చెఉస్కొని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారు మహేష్. మైత్రి మూవీ మేకర్స్ ధన్యవాదాలు. అలాగే తమ సినిమా విడుదలను మార్చినందుకు దిల్ రాజు గారికి #F3మూవీ టీమ్‌కి ధన్యవాదాలు. బీమ్లా నాయక్ విడుదల తేదీని వాయిదా వేయాలని చినబాబు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. టీమ్ అందరికీ శుభాకాంక్షలు” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాజమౌళి.

The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of #BheemlaNayak is well appreciated. Wishing the team all the very best…:)— rajamouli ss (@ssrajamouli) December 21, 2021