శ్యామ్ సింగ రాయ్.. కథ ఇదేనా ?

తాజాగా నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, హీరో , హీరోయిన్లు గా నటించిన చిత్రం  “శ్యామ్‌ సింగరాయ్‌”. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాని ద్విపాత్రాభినయం చేశాడు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలై ట్రైలర్‌ చూసి ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నారు. నాని శ్యామ్ సింగరాయ్ గా ఎలా మారాడు అనేది చూపించకుండా  స్క్రీన్ ప్లేతో రాహుల్ మ్యాజిక్ చేశాడని సినీ వర్గాల సమాచారం.

ఈ మూవీ కథను వివరిస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తాడు నాని. అప్పటికే షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించి.. క‌థ కోసం కోల్‌క‌తా వెళ‌తాడు. అక్కడ ఒకప్పటి రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుంది. అతడి గురించి ఎక్కువగా స్టడీ చేస్తే తరుణంలో ఆ పాత్రలో తనని ఊహించుకుంటాడు నాని.తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు..  సెకండాఫ్‌లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తోంది ప్రస్తుతానికైతే ఈ కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ చిత్రం డిసెంబర్‌ 24న థియేటర్లో విడుదలకు సిద్దమైంది.