బ్లాక్ బస్టర్ ఏపీసోడ్స్ కేరాఫ్ అడ్రస్

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ గెస్ట్ గా మారిపోయాడు. బ్లాక్ బస్టర్ ఏపీసోడ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. టాలీవుడ్ స్టార్స్ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ప్రసారమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోని డీల్ చేశారు.

ఈ షో ఫస్ట్ సీజన్ ఎండింగ్ ఏపీసోడ్ కి మహేష్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. మహేష్-తారక్ ల ముచ్చట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య హోస్ట్ గా ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే తొలి సీజన్ ఆఖరి ఏపీసోడ్ కు మహేష్ నే గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో మన ప్రిన్స్ బ్లాక్ బస్టర్ గెస్ట్ గా మారాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం మహేష్ సర్కారివారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. బ్యాక్ దోపిడి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సంక్రాంతికే రావాల్సిన సర్కారువారి పాట.. ఏప్రిల్ కి వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని బ్లాక్ బస్టర్ ఏపీసోడ్స్ కి గెస్ట్ గా వెళ్లారు ప్రిన్స్. బాబాయ్-అబ్బాయ్ లతో మహేష్ ముచ్చట్లను బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది.